Friday, 18 July 2025 06:28:34 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో కాల్పులు, మహిళకు గాయాలు

Date : 21 April 2023 12:00 PM Views : 320

జై భీమ్ టీవీ - జాతియం / : ఢిల్లీ సాకేత్ కోర్టు ఆవరణలో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటన అడ్వకేట్స్ బ్లాక్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక మహిళకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన మహిళ న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని డీసీపీ సౌత్ చందన్ చౌదరి ధ-ృవీకరించారు. ఆగంతకుడు లాయర్ల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన మహిళ భర్తే కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు అంచనా వేస్తు్న్నారు. కుటుంబ తగాదాలేవైనా కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మహిళనే టార్గెట్ చేసి దుండగుడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :