జై భీమ్ టీవీ - జాతియం / : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించింది. తాము ప్రభుత్వంలోకి వస్తే.. ఉచిత విద్యుత్, ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు రూ.1500. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కుటుంబానికి చెందిన ప్రతి మహిళకు నెలకు రూ.2,000. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎస్సీలకు 15% నుంచి 17%, ఎస్టీలకు 3% నుంచి 7%, మైనారిటీ రిజర్వేషన్లు 4% పునరుద్ధరణ లింగాయత్లు, వొక కలిగ్గలు, ఇతర వర్గాల రిజర్వేషన్లను పెంపు... 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రయత్నం బజరంగ్ దళ్, PFI వంటి సంస్థలను నిషేధం విధించడంతోపాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యలు మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చేస్తాం రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంపు కర్ణాటక ఎన్నికలు.. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Admin