Saturday, 24 May 2025 02:55:12 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

కల్తీ మద్యం దిగుమతి అవుతుంది..జాగ్రత్త: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Date : 17 May 2023 04:54 PM Views : 930

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకురావడం చట్టరీత్యా నేరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో తయారు చేసిన మద్యం బాటిళ్లను మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలని సూచించారు. వారం రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు 1,333 మద్యం బాటిళ్లు దిగుమతి అయ్యాయని మంత్రి వెల్లడించారు. ఒరిస్సా అడవుల్లో అక్రమంగా మద్యం తయారు చేసి.. తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు. హర్యానా నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని కూడా పట్టుకున్నామన్నారు. ఈ మద్యం కల్తీ అవుతుందని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే.. ఒక్కోవ్యక్తికి రెండు బాటిళ్లు అనుమతి ఉందని మంత్రి గుర్తుచేశారు. ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 80కి పైగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 300 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి విమానంలో హైదరాబాద్ కు మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు వాటిని గుర్తించి సీజ్ చేశారు. ఇతర రాష్ట్రల నుంచి దుండగులు మద్యం సరఫరా చేస్తే.. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా నష్టం జరుగుతదని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహరానికి సంబంధించిన నిందితులను పట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :