జై భీమ్ టీవీ - జాతియం / : టీ తయారు చేయడం చాలా సులభం. టీ పొడి, పాలు, పంచదార ఉంటే చాలు.. టీ ఈజీగా తయారవుతుంది. అయితే ఈ రోజుల్లో తనకు ఇష్టమైన టీపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు చాలా మంది. టీలో టీ పొడినే కాకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా కలుపుతున్నారు. ఉదయం లేచిన వెంటనే టీ తాగడం మొదలుపెట్టిన భారతీయులకు రాత్రి పడుకునే వరకు టీ అవసరం. ఈ టీ తాగడం వల్ల మీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి, ఏ పని చేస్తున్నా.. మధ్య మధ్యలో ఛాయ్ బ్రేక్ తప్పనిసరిగా తీసుకుంటారు. విసుగు, చిరాకుతో ఉన్న వారు అదే టీని మసాలా దినుసులు కలిపి ప్రత్యేకంగా తయారు చేసుకుని తాగుతారు. అల్లం, తులసి, దాల్చిన చెక్కతో సహా మసాలా దినుసులతో కలిసి తయారు చేసే టీ అదరగొడుతుంది. టీ రుచిని మార్చేందుకు వెన్న కలుపుతున్న టీ తయారీదారులను చూశారా..? అవును, టీ చేయడానికి వెన్నను ఉపయోగిస్తున్నారు.. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం… చక్కెర ఆరోగ్యానికి హానికరం కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే బెల్లం టీని తయారుచేస్తారు. అయితే ఈ వ్యక్తి టీలో వెన్న వేస్తున్నాడు… ఆయన టీ తయారుచేసే విధానం కూడా వెరైటీగా ఉంది. అతను టీలో 16 రకాల సుగంధ ద్రవ్యాలు, వెన్న, గులాబీ రేకులు (టీ పెటల్స్) వేశాడు. వీటన్నింటితో పాటు టీపొడి కూడా వేశాడు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ వ్యక్తి ఈ స్పెషల్ ఛాయ్కి దాల్ మఖానీ, చాహా మఖానీ అనే క్యాప్షన్ ఇచ్చాడు.
Admin