జై భీమ్ టీవీ - జాతియం / : దేశ రాజధాని ఢిల్లీలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రోడ్డు మధ్యలో బారికేడ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ నిల్చుకుని విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ను కారుతో బలంగా ఢీకొట్టాడు. నిందితుడు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో చోటుచేసుకుంది. అక్టోబర్ 24, 25వ తేదీ మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డులో సగ భాగం బారికేడ్ తో కవర్ చేయబడింది. బారికేడ్ల పక్క నుంచి వాహనాలు వెళ్తున్నాయి. అదే సమయంలో బారికేడ్ సమీపంలో డ్యూటీ చేస్తూ నిలిబడి ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తున్నాడు. కానిస్టేబుల్ ఓ కారును ఆపి దాని డ్రైవర్ను విచారిస్తున్నాడు. అదే సమయంలో ఒక కారు అతి వేగంగా ముందు నుంచి వచ్చి.. నిల్చుని ఉన్న కానిస్టేబుల్ ని ఢీకొట్టింది.
Admin