Friday, 18 July 2025 06:46:49 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. నివాస ప్రాంతాలపై దాడి..

Date : 28 October 2023 09:16 AM Views : 551

జై భీమ్ టీవీ - జాతియం / : రెచ్చగొట్టే ధోరణిని దాయాది దేశం పాక్‌ కొనసాగిస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్‌లోని ఆర్నియా సెక్టార్‌లో గురువారం సాయంత్రం జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ సహ ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పాక్ వైపు నుంచి గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన కాల్పులు శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగాయి. అంతర్జాతీయ సరిహద్దులకు సంబందించి భారత్‌, పాక్‌ మధ్య 2021 ఫిబ్రవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే మొదటిసారి. నివాస ప్రాంతాలను టార్గెట్‌ చేస్తూ పాక్‌ కాల్పులు జరపడంతో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారత్‌ కూడా పాక్‌ చర్యలకు దీటుగా జవాబు చెప్పింది. కాల్పుల కారణంగా రాత్రంతా బిక్కుబిక్కుమంటు గడిపామని సరిహద్దు గ్రామాల ప్రజలు తెలిపారు. కాల్పుల ఆగిన వెంటనే చాలా మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆర్నియా సెక్టార్‌లోని సరిహద్దుల వెంట సైన్యం, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన కాసేపటికే పాక్‌ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. వారం క్రితం కూడా పాక్‌ వైపు నుంచి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు గాయపడ్డారు. అయితే BSF స్థానిక కమాండర్లు, పాక్‌ రేంజర్స్‌ మధ్య వెంటనే సమావేశం జరగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను విద్యుత్ బల్బులను స్విచ్ ఆఫ్ చేసి ఇంటి లోపలే ఉండాలని BSF ఆదేశించింది. అర్నియాతో సహా సరిహద్దు ప్రాంతాలలో కూడా హై అలర్ట్‌లో ఉంచారు. సరిహద్దుకు వెళ్లే అన్ని రహదారులపై పోలీసులు బారికేడ్లు వేసి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించారు. బయటకు వచ్చిన ప్రజలను ఇళ్లకు తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కాల్పుల్లో పాకిస్థాన్‌కు కూడా భారీ నష్టం వాటిల్లిందని ఐబీ తన నివేదికలో పేర్కొంది. భారత కాల్పుల్లో ఐదు నుంచి ఆరుగురు సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. కాల్పులు చాలా భారీగా జరుగుతున్నాయని అర్నియాలో భయాందోళనకు గురైన స్థానికులు తెలిపారు. అందరూ భయపడుతున్నారు. ప్రజలు బంకర్లలో దాక్కున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇది ప్రతి నాలుగు-ఐదు సంవత్సరాలకు జరుగుతుంది. అందరూ తమ ఇళ్లలో దాక్కుంటారు. ఇక్కడికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే సరిహద్దు ఉంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :