Sunday, 07 December 2025 09:46:35 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయిన ప్రధాని మోడీ పాట.. ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ స్పెషాలిటీ ఇదే

Date : 11 November 2023 04:12 PM Views : 898

జై భీమ్ టీవీ - జాతియం / : తృణ ధాన్యాల ప్రాధాన్యత, లాభాలను వివరిస్తూ ఈ ఏడాద జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పాట విడుదల చేశారు. ప్రముఖ ఇండో – అమెరికన్‌ గాయని ఫాల్గుణి షాతో కలిసి ఈ పాటను రాయడమే కాకుండా తన గొంతును కూడా అందించారు ప్రధాని. అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పేరుతో హిందీతో పాటు ఇంగ్లిష్‌ భాషల్లోనూ ఈ పాట విడుదలైంది. పాటలో భాగంగా మోడీ స్వయంగా పలికిన మాటలు ఈ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను ఎలా నిర్మూలించవచ్చు అన్నది ఈ పాట రూపంలో తెలియజేశారు ప్రధాని మోడీ, ఫాలు దంపతులు. తాజాగా ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాట ప్రతిష్ఠాత్మక గ్రామీ పురస్కారానికి నామినేట్‌ అయ్యింది. కాగా 2022లోనే ఫాల్గూణి షాకు గ్రామీ అవార్డు వరించింది. ఈ సందర్భంగానే ఫాల్గుణి షా, ఆమె భర్త గౌరవ్‌ షా స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సమయంలోనే ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటకు పునాది పడింది. మనుషుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సంగీతానికి బలమైన శక్తి ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆకలి నిర్మూలన సమస్య కోసం ఒక పాట రాయాలని ప్రధాని మోడీ ఫాల్గుణి షా దంపతులకు సూచించారట. అప్పుడే తృణ ధాన్యాలపై ప్రత్యేక గీతాన్ని రూపొందించాలని ఫాల్గుణి షా డిసైడ్‌ అయ్యారట. అయితే తమ పాటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా భాగం చేయాలనుకున్నారట ఫాలూ దంపతులు. ‘తృణ ధాన్యాలపై పాటలో మోడీని భాగం చేయాలని మేం అనుకున్నాం. అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ప్రధానితో కలిసి పాట రాసేందుకు మొదట మేం భయపడ్డాం. అయితే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం. పాట మధ్యలో ప్రధాని కొన్ని మాటలు మాట్లాడతారని, ఈ సాంగ్‌కు అవే ప్రత్యేకాకర్షణగా నిలిచాయి’ అని అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ సాంగ్ రిలీజ్‌ సందర్భంగా చెప్పుకొచ్చారు ఫాల్గూణి షా దంపతులు. కాగా ఐక్యరాజ్య సమితి 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌ ప్రతిపాదనే ఇందుకు ప్రధాన కారణం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :