Saturday, 24 May 2025 02:49:06 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తల ఆగ్రహం

Date : 05 November 2022 02:51 PM Views : 925

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను మంగళగిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ ను ఆపేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. పవన్ కల్యాణ్ వెంటనే కారు దిగి కార్యకర్తలతో కలిసి ఇప్పటం వెళ్లారు. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలకు చెందిన.. 53 ఇళ్లు, ప్రహారీ గోడలు కూల్చివేశారు. జనసేన మీటింగ్ కుస్థలం ఇచ్చారనే కారణంగా కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటంలోని బాధితులను పరామర్శించేందుకు పవన్ ఇవాళ ఇప్పటం బయల్దేరారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సరిహద్దులో ముళ్ల కంచెలు పెట్టారు. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పవన్ కల్యాణ్ ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించారు. గ్రామంలో పవన్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కూల్చివేతలపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్న గ్రామంగా ఉన్న ఇప్పటంలో రోడ్ల విస్తరణ ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజలంతా పూజించే నంది విగ్రహాన్ని, పీవీ నరసింహ రావు విగ్రహన్ని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామం ఏమైనా కాకినాడా, రాజమండ్రా అని ప్రశ్నించారు. వైసీపీ ఇలాగే చేస్తే మేం ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :